telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిరంజీవి రిక్వెస్టును పూచికపుల్లలా తీసేసిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో కలిశారు. భోజనాలు చేశారు.
రెండు వారాల క్రితం, చిరంజీవి తో పాటు కొందరు ఇతర నేతలు. తెలుగు సినిమాకు సంబంధించిన టిక్కెట్ ధరల నమూనా, ఇతర అంశాలపై సమావేశం కొనసాగింది. గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవి మీడియాతో ముచ్చటిస్తూ మరో రెండు వారాల్లో పెద్ద వార్త రాబోతోందని, వైఎస్ జగన్‌తో తన భేటీకి సానుకూలత ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రెండు వారాలు అయిపోయాయి. కానీ ఇంకా టికెట్ ధర జీవో సవరణ కోసం మొత్తం టాలీవుడ్ వేచి ఉంది. ఈ సమస్య కోర్టులో కూడా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ కమిటీ ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమ కౌంటర్ దాఖలు చేయనుంది. ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేదు.

జగన్ సర్కారు సృష్టించిన టిక్కెట్ల సమస్య పరిష్కారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో టికెట్ ధరల పోర్టల్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ సమస్యనుపరిష్కరించకపోవచ్చు.

ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కారం కావాలంటే టాలీవుడ్ మరికొంత కాలం వేచి ఉండటం తప్ప వేరే మార్గం లేదు. లేకపోతే బీమ్లా నాయక్ విడుదల తర్వాత గాని టిక్కెట్ల రేట్లుపెంచరేమో. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా పవన్ చుట్టూనే తిరుగుతా ఉంది కదా. ప్రభుత్వంతో పాటు కరోనా దెబ్బకు తెలుగులో సినిమాల విడుదలే ఆగిపోయింది.

ప్రస్తుతానికి, ఇటీవలి సమావేశాల అనంతరం పెద్ద పరిణామాలు ఏం జరగలేదు.

Related posts