telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కేసీఆర్‌కు జగన్ బకరాలా దొరికాడు: సీపీఐ రామకృష్ణ

Against Modi Visiting AP Says CPI CPM

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బకరాలా దొరికాడని వ్యాఖ్యానించారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాగం అందుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్లో నడుస్తుంటే జగన్ కేసీఆర్ డైరెక్షన్‌లో నడుస్తున్నారని విమర్శించారు.  బీజేపీకి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ఉపయోగపడేలా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ పని మానుకోవాలని సూచించారు.  ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని భూములపై బాండ్ల రూపంలో రూ.2వేల కోట్లు అప్పు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు రాజధాని భూములను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ఓడించకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడడం ఖాయమని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts