telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల సాయంతో పాలన సాగిస్తున్నారు: కన్నా

Kanna laxminarayana

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలు గుంటూరులోని కన్నా వారి తోట నుంచి ర్యాలీగా తుళ్లూరు బయల్దేరారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రస్తుతం జగన్ పరిపాలన పోలీసుల సాయంతోనే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు స్వార్థంతోనే పనిచేస్తాయని విమర్శించారు. దురుద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు.

Related posts