వరంగల్ చౌరస్తాలో ఉన్న ఓ ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిషన్లోని నగదు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో అందులోని రెండు ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా నగదు కాలిపోయినట్లు తెలుస్తోంది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
next post