telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అమిత్ షా .. తెలంగాణ టూర్ రద్దు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తెలంగాణాలో పర్యటించాల్సి ఉంది. అయితే నిన్న రాజ్ నాధ్ సింగ్ సభకు జనాలు పెద్దగా హాజరవకపోవటంతో నిరుత్సహపడ్డారు. అదే పరిస్థితి అమిత్ షా కు కూడా పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ సభను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రధానితో అత్యవసర సమావేశం కారణంగానే తెలంగాణాలో నేటి ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

అయితే గుంటూరు జిల్లా నరసరావుపేటలో అమిత్ షా సభ యధావిధిగా ఉంటుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Related posts