బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తెలంగాణాలో పర్యటించాల్సి ఉంది. అయితే నిన్న రాజ్ నాధ్ సింగ్ సభకు జనాలు పెద్దగా హాజరవకపోవటంతో నిరుత్సహపడ్డారు. అదే పరిస్థితి అమిత్ షా కు కూడా పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ సభను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రధానితో అత్యవసర సమావేశం కారణంగానే తెలంగాణాలో నేటి ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే గుంటూరు జిల్లా నరసరావుపేటలో అమిత్ షా సభ యధావిధిగా ఉంటుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.