telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి: మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy letter pad soial media |

తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌లతో కలిసి శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…కీసర గుట్ట నా నియోజకవర్గ పరిధిలో వుండటం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… మహాశివరాత్రి పర్వదినాన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Related posts