telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ

uma devineni

వెలిగొండ ప్రాజెక్టుకు 1989లోనే ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. వైఎస్ఆర్ అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలిగొండ టన్నెల్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టన్నెల్ చరిత్రను బయటపెట్టామని చెప్పారు.

గత ఏజెన్సీ 3.8 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.400 కోట్లకు పెంచామని దేవినేని చెప్పారు. దీనిపై రివర్స్ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న కంపెనీలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

Related posts