ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాకిస్థాన్ ప్రబుత్వంలోని ఓ విశ్వసనీయమైన వ్యక్తి నుంచి ఈ సమాచారం వెల్లడైనట్టు పాక్ మీడియా వెల్లడించింది. మనకు అందుతున్న సమాచారం మేరకు దావూద్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కరాచీలోని మిలిటరీ ఆసుపత్రిలో దావూద్ తో పాటు అతని భార్య కూడా చికిత్స పొందుతోంది.
ముంబైలోని డోంగ్రీలో జన్మించిన దావూద్ ఇబ్రహీం ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 బాంబే బాంబు పేలుళ్ల కేసులో అతను కీలక ముద్దాయి. దావూద్ పై పలు ఇంటర్ పోల్ నోటీసులు ఉన్నాయి. 2003లో దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఇండియా, అమెరికా ప్రకటించాయి. ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లలో ఒకరిగా దావూద్ ను అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ప్రకటించింది.
చంద్రబాబు కష్టపడినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు గజదొంగలు: సీపీఐ నారాయణ