సీఎం కేసీఆర్ సహకారంతో ఇళ్లునిర్మించి ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేస్తానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజక వర్గంలో 2.52 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్బెడ్రూమ్ ఇళ్లను, కొల్లూరు గ్రామంలో 7.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను స్పీకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజక వర్గంలో పరిదిలోని 106 గ్రామాల్లో అన్ని వసతులతో 500కోట్లతో 5వేల ఇళ్లునిర్మిస్తున్నట్టు చెప్పారు.
పేదవారికి కేటాయించిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నాయకులు డబ్బులు వసూలుచేసుకోవద్దని ఈసందర్భంగా చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. ఎవరైనా పేదల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజక వర్గానికి కేటాయించిన కోల్డ్స్టోరేజీతో కూడిన గోదామును రాంగంగానగర్ గ్రామ సమీపంలో నిర్మించడానికి ప్రతిపాదనలుపంపినట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలే.. జగన్ పై లోకేశ్ విమర్శలు