బెంగళూరులో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఈ మేరకు ఆ యువతిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఈ అంశంపై కర్ణాటక సీఎం యడియూరప్ప స్పందించారు. అమూల్య లియోన్ కు గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు లేనట్టేనని స్పష్టం చేశారు. అమూల్య వెనుక ఉన్న సంస్థలు ఏమిటో దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంస్థలకు అడ్డుకట్టపడదని యడియూరప్ప అభిప్రాయపడ్డారు.