యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలయిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు ఆది పురుష్ లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలువిద్య నేర్చుకోనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఓ సెట్ వేసుకుని ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ట్రైనింగ్ లో బాణాలు ప్రయోగించడం, ఇతర వాటిపై శిక్షణ తీసుకోనున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి బాడీ ఫిట్నెస్ కోసం ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తున్నాడు. రాముడి పాత్రలో ధీరుడిగా కనిపించేందుకు ప్రభాస్ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. ఇక బాహుబలి కోసం ప్రభాస్ యుద్ధ విద్యలు నేర్చుకున్న విషయం తెలిసిందే.
next post