telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పవన్‌ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…స్టార్ క్యాంపెయినర్ అట !

తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి… ప్రచారం చేస్తున్నాయి. అయితే.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “NOTA తోనే పోటీ అనుకుంటున్న చోట ఏ స్టార్ దిగి వచ్చినా ఫలితం మారదు. పోటిలోనే లేని పార్టీ అధ్యక్షుడు అక్కడ స్టార్ క్యాంపెయినర్! ఆవేశపూరిత ప్రసంగాలతో ఆయాసపడుతూ మీకు రోషం లేదా పౌరుషం లేదా అని చంద్రబాబులా ప్రజలను నిలదీస్తే ఏం జరిగిందో మున్సిపల్ ఎన్నికల్లో చూశారుగా!” అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందుకు ట్వీట్‌లో.. చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. “అర్చక వ్యవస్థను భ్రష్టుపట్టించాడు చంద్రబాబు. గర్భగుడిలోని అర్చకులను రోడ్లపాల్జేసిన దుర్మార్గుడు బాబు. మళ్లీ ఆ వ్యవస్థకు జగన్ గారు జీవం పోశారని అర్చక సమాఖ్యలే చెబుతున్నాయి. వారికి ఉద్యోగాలిచ్చి పూర్వవైభవం కల్పించారు జగన్ గారు. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలు తవ్వకుండానే బయట పడుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య పరికరాల సరఫరా, నిర్వహణకు సంబంధించి తాజాగా 450 కోట్ల స్కాం వెలుగు చూసింది. ఉపకరణాల ధరలను అమాంతం పెంచేసి ప్రభుత్వ గద్దలు, ప్రైవేటు కంపెనీలు పంచుకున్నాయి.” అంటూ ఫైర్‌ అయ్యారు.

Related posts