telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రెడ్డి వర్గం నేతలపై బీజేపీ కన్నేసిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారే విషయమై తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరితే కలిగే లాభాలను గురించి వివరించి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

త్వరలోనే బీజేపీలో పెద్దఎత్తున చేరికలు చూడబోతున్నామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని చెప్పారు.పార్టీ మారినా తన ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ఢోకా ఉండదని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ముందుగానే బీజేపీలోకి చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డట్టు ఆయన అనుచరులు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related posts