telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి: డొనాల్డ్ ట్రంప్

trump usa

కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ, మిషిగాన్, లూసియానాలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ఈ లెక్కన ప్రభుత్వ మార్గనిర్దేశాలను ప్రజలు పాటిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అధికారం అధ్యక్షుడిగా పూర్తిగా తన చేతుల్లోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ‘అమెరికా రీఓపెన్’కు సంబంధించిన ప్లాన్‌ రూపకల్పన చివరి దశకు వచ్చిందని చెప్పారు.కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ చీఫ్ మాత్రం ట్రంప్‌ వాదనకు భిన్నంగా స్పందించారు.

గత వారంలో అధిక కేసుల వచ్చాయన్నారు. కరోనా కారణంగా దేశంలో చాలా మంది చనిపోతారని అంచనా వేశారు. కాగా, గడచిన 24 గంటల్లో అమెరికాలో 1509 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 23,529కి చేరింది. ఒక్క న్యూయార్క్‌లోనే మరణాల సంఖ్య 10 వేలు దాటింది. నిన్న ఒక్క రోజే అక్కడ 722 మంది చనిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Related posts