గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో తెదేపా వ్యవస్థాపకుడు, నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు ధ్వంసం చేయడంపై రాష్ర్టంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు..
తాజాగా.. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ ఈ ఘటనపై ప్రెస్ నోట్ విడుదల చేశాడు. మన తెలుగు జాతి దేవుడు, తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ తారక రామారావు మహాపురుషిని ఈ సందర్భంగా కీర్తించారు.
తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటమనేది మన తెలుగు జాతిని అవమానించినట్లే ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటివి చేస్తే తెలుగు జాతి ఊరుకోదని, ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.
మేము ఎన్.టి.ఆర్ అభిమానులము అని కొందరు వై.ఎస్.ఆర్.సీ.పీలో వెర్రివీగే నాయకులు నిద్రపోవుచున్నారా పోతున్నారా అని ప్రశ్నించారు.మీకు మా అన్న గారి మీద ఏ మాత్రం అభిమానం ఉన్నట్లయితే తక్షణమే దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా..ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు సుత్తితో కొడుతూ ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.