telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మిత్రుడు శివప్రసాద్ మరణం టీడీపీకి తీరని లోటు: చంద్రబాబు

chandrababu

టీడీపీ నాయకుడు, చిత్తూర్ మాజీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా చిరకాల మిత్రుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం టీడీపీకి తీరని లోటు అని అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన శ్రమ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు ముందు వినూత్న రీతిలో తెలిపిన నిరసన దేశ ప్రజలు మరచిపోలేరన్నారు. సాంస్కృతిక శాఖ, సమాచార శాఖ మంత్రిగా అనేక సంస్కరణలకు శివప్రసాదరావు నాంది పలికారన్నారు. చిత్తూరు ఎంపీగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts