telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హెరిటేజ్ పై అసెంబ్లీ లో మంత్రి వ్యాఖ్యలు: చంద్రబాబు ఫైర్

chandrababu

ఏపీ శాసనసభలో హెరిటేజ్ సంస్థ గురించి మంత్రి పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హెరిటేజ్ కు సంబంధించిన స్వీట్స్ ను నారా బ్రాహ్మిణి తమకు పంపించారని, హెరిటేజ్ వారిది కాకపోతే తమకు ఆ స్వీట్స్ ఎలా పంపిస్తారని శ్రీవాణి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చంద్రబాబు వివరణ ఇస్తూ హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఫ్రెష్ కు తేడా తెలియనివారు ఈ సభలో ఉన్నారని విమర్శించారు.

ఈ రెండూ వేర్వేరని… హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్ కు ఎప్పుడో అమ్మేశామని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వీరికి తెలియడం లేదని అన్నారు. ప్రజల సమస్యలన్నీ గాలికొదిలేసి, 24 గంటలు తనమీద బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.

Related posts