telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే శనివారం సాయంత్రం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.అంటే ఇకపై ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts