telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి రాజధానిపై పోరాటం ఆగదు: చంద్రబాబు

chandrababu speech on 12 hrs diksha

అమరావతి రాజధానిపై పోరాటం ఆపే ప్రసక్తేలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు.అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పడ్డ జేఏసీ సమావేశంలో నాయుడు మాట్లాడుతూ.. జేఏసీ నేతల బస్సు యాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. నేను సీఎంగా ఉన్న సమయంలో జగన్ సహా ఇతర నేతలు పాదయాత్రలు చేశారన్నారు. నేను కూడా ఇదే రీతిన అడ్డుకుంటే వారి యాత్ర సాగేదా ? అని ప్రశ్నించారు.

 రాజధాని ఇక్కడే అంటూ ప్రభుత్వం ప్రకటించేవరకు జేఏసీ పనిచేయాలన్నారు. రాజధానికోసం పోరాడుతూ ఇప్పటివరకు 11 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రకటనలు చేయడం కాదని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాయర్లు ముందుండి పోరాడితే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Related posts