పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ కొనసాగుతోంది. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై లోక్ సభలో గందరగోళం చెలరేగింది. ఒవైసీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాక్ ల నుంచి భారత్ లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యల పై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇటువంటి చట్టం నుంచి దేశాన్ని కాపాడాలని నేను స్పీకర్ ను కోరుతున్నాను. అలాగే, దీని నుంచి అమిత్ షాను కూడా కాపాడాలి.. లేకపోతే ఆయన హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ ల వంటి నేతల సరసన చేరుతారని అన్నారు.