ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న కోహ్లీ ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేదని అన్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన బాధ్యతను స్వీకరించే సమయం ఆసన్నమైందని గంభీర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అశ్విన్ విషయంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండని..రెండేళ్లకు పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జట్టును విజయపథంలో నడిపించ లేకపోయాడని తొలిగించిందని తెలిపాడు. ధోని సారథ్యంలో సీఎస్కే మూడు టైటిల్స్, రోహిత్ కెప్టెన్సీలో ముంబై నాలుగు టైటిల్స్ గెలుచుకుంది. కోహ్లి సారధ్యంలో ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదని తెలిపాడు. డైరెక్ట్ గా చెప్పకపోయినా..కోహ్లిని తప్పుకోమ్మని గంభీర్ సలహాలు ఇచ్చాడు. కాగా…చావో, రేవో తేల్చుకోవాల్సిన నిన్నటి మ్యాచ్లో బెంగుళూరుపై సన్రైజర్స్ అద్భుత విజయం సాధించింది. ఆరు వికెట్లతో తేడాతో గెలిచి..ఫైనల్ రేస్లో నిలిచింది. దీంతో ఆర్సీబీ ఇంటి దారి పట్టింది.
previous post
మోడీ గారడి మాటలకు ఓట్లు పడవు: చంద్రబాబు