telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ ఆటలు సాగవు: మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy,KCR

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో స్థానికేతరుడని, ఆయన ఆటలిక్కడ ఏమి సాగవన్నారు. పోటీ ఏమైనా ఉంటే కాంగ్రెస్‌తోనే కానీ, బీజేపీ ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు.

టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం నల్లేరుపై నడకేననీ మంత్రి అన్నారు. మెజారిటీ ఎంతుస్తున్నదే ప్రధానాంశమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు. అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాలే ఇక్కడ వస్తాయని మంత్రి పేర్కొన్నారు. .

Related posts