రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం శివసేన 124 స్ధానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ ఇతర చిన్న పార్టీలు కలిసి 164 స్ధానాల్లో బరిలో దిగుతాయి. తనకు కేటాయించిన 164 స్ధానాల్లో రిపబ్లికన్ పార్టీ, రాష్ర్టీయ సమాజ్ పక్ష, రాయల్ క్రాంతి సంఘటన వంటి చిన్న పార్టీలకు 14 స్ధానాలను కాషాయ పార్టీ కేటాయిస్తుంది. సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించిన సంయుక్త విలేకరుల సమావేశంలో శివసేన యూత్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు.
వొర్లి నుంచి ఆదిత్య ఠాక్రే భారీ ఆధిక్యంతో గెలుపొందుతాడని మహారాష్ట్ర సీఎం, సీనియర్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ-సేన కూటమి అధికారంలోకి వస్తే శివసేన సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే ముందువరుసలో ఉంటాడని భావిస్తున్న క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ రాజకీయాల్లోకి వచ్చీరాగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం అర్ధం లేనిదని, ఆదిత్య ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.
కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది: లక్ష్మణ్