ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు..
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుండి అసెంబ్లీకి చేరుకుని మొదట చంద్రబాబు ఓటేసారు.
అనంతరం ఎమ్మెల్యేలు కె. అచ్చెన్నాయుడు ఎన్.రామానాయుడు, గద్దె రామ్మోహన్రావు, గంటా శ్రీనివాసరావు, ఎన్. చినరాజప్ప పయ్యావుల కేశవ్ ఆదిరెడ్డి భవాని తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 175 మంది శాసన సభ్యులలో ఇప్పటివరకు167 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 14 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది.
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్