బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నం చేసాడు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన గన్ మెన్లు అప్రమత్తమై అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనపై నందిగం సురేష్ స్పందించారు. తెలుగుదేశం నాయకుడు నా పైన దాడి చేయడానికి ప్రయత్నించాడని..మా ఇంటి సమీపంలో బత్తుల పూర్ణచందర్రావు అనే తెలుగుదేశం నాయకుడు బైకు అడ్డంపెట్టి నా కారును అడ్డుకోవడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.
నేను ఎవరు నువ్వు అని ప్రశ్నించానని..నన్ను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. వెంటనే నా పైకి దాడి చేయడానికి ప్రయత్నించాడని.. నా సెక్యూరిటీ అప్రమత్తం అయి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. బత్తుల పూర్ణచంద్రరావు పక్కనే ఉన్న అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లో కి పారిపోయాడని…అదే సమయంలో పూర్ణ చంద్ర రావు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు బయటపడిందన్నారు. నా సెక్యూరిటీ అతన్ని , అతను వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డును పోలీసులకు అప్పగించిందని తెలిపారు.
previous post