‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి హిట్ సినిమాలతో హీరో సిద్ధార్థ్ తెలుగులో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. అయితే, ఆ తరవాత వరుసపెట్టి డిజాస్టర్లు రావడంతో సిద్ధార్థ్ తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఆయన చివరిగా డబ్బింగ్ మూవీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు చాలా కాలం తరవాత ఒక తెలుగు సినిమాను అంగీకరించారు. శర్వానంద్ హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధార్థ్ విలన్గా నటించనున్నట్టు గత కొద్ది రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ వదంతులను నిజం చేస్తూ శుక్రవారం చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. ‘మహాసముద్రం’లో సిద్ధార్థ్ నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రేజీ మల్టీస్టారర్లో శర్వానంద్తో కలిసి నటించడానికి సిద్ధార్థ్ అంగీకరించినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ను నిర్మించిన ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఇప్పుడు ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
He is an ocean of talent and returns back to Telugu Cinema..Welcoming @Actor_Siddharth on board for #Mahasamudram 🌊 @ImSharwanand @DirAjayBhupathi @AKentsOfficial @AnilSunkara1 #SidIsBack
More interesting updates soon! 💥 pic.twitter.com/HKgzlrHZW0
— AK Entertainments (@AKentsOfficial) September 18, 2020
నాతో అడ్డమైన పనులూ చేయించుకునేవారు… స్టార్ హీరో కామెంట్స్