telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బెల్లంకొండ తో జత కట్టనుంది ఆమేనా…?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ తన తొలి చిత్రంతోనే అందిరినీ ఆకట్టుకున్నారు. తరువాత వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్న ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్‌గా శ్రీనివాస్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు కొందరు స్టార్ హీరోయిన్‌లను సంప్రదించినప్పటికీ వారు తమతమ సినిమాలతో బిజీ అని తిరస్కరించారు. వారిలో దిశా పటానీ, శ్రద్దా కపూర్ తదితరులు ఉన్నారు. తాజాగా ఛత్రపతి టీమ్ అనన్య పాండేను సంప్రదించారంట. ప్రస్తుతం అనన్య విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. ఈ సినిమా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరి అనన్య బెల్లంకొండ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related posts