telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మెక్కింది అంతా కక్కిస్తా.. కేటీఆర్ పై బీజేపీ నేత ఫైర్

BJPpresident -K-Laxman

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ హెచ్చరికలకు పోవద్దని హితవు పలికారు. హెచ్చరికలకు పోతే మెక్కింది అంతా కక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్నది మోదీ, అమిత్ షా ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మిషన్ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారిపోయిందంటూ ఆరోపించారు. రూ.30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్ జేబులు నింపేందుకే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు.

ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలకు నోచుకోలేదంటూ మండిపడ్డారు. రైతు రుణమాఫీ పత్తాలేదంటూ విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు రుణమాఫీ వంటి పథకాలు పూర్తిగా పడకేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని నాలుగు రోజులుగా సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

Related posts