telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయి: చంద్రబాబు

chandrababu

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ పాలన పై విరుచుకుపడ్డారు. శుక్రవారం టీడీపీ వ్యూహ కమిటీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయన్నారు. దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని చంద్రబాబు విమర్శించారు. దీంతో యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. అధికార పక్షానికి పాలనపై అవగాహన లేదని, ప్రతిపక్షం చెబితే వినరని అన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని చంద్రబాబు అన్నారు.పోలవరం ప్రాజెక్ట్, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయని అన్నారు. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో అభివృద్ధి పనుల్లో ప్రతిష్టంభన నెలకొందని దుయ్యబట్టారు. వైసీపీ నేతల చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts