telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ వాళ్లు తమ మనుషులతో దాడి చేయించారు: చంద్రబాబు ఫైర్

chandrababu campaign in karnataka

ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి చేసిన తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ జరగని దాడి ఇప్పుడే జరిగిందంటే దాని అర్థమేంటని ప్రశ్నించారు. రాజధానిలో తన పర్యటనను ‘ఓ ఇష్యూ’ చేయాలని చెప్పి వైసీపీ నాయకులు వాళ్ల మనుషులను తీసుకొచ్చి చెప్పులు, రాళ్లు వేసి దాడి చేయించారని ఆరోపించారు.

నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతిచ్చామనిఏపీ డీజీపీ అన్నారని, రేపు సీఎం పర్యటిస్తే తాము కూడా నిరసన తెలుపుతామంటే పర్మిషన్ ఇస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. నా కాన్వాయ్ వస్తూ వుంటే వాళ్లొచ్చి రాళ్లు వేస్తూ వుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇది రైతుల దాడి కాదు, ప్రభుత్వ దాడి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts