telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి చిన్నచూపు లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి చిన్నచూపు లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గురించి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ, నిధులు ఇవ్వడంలో ఆలస్యమైతే అవచ్చొమో కానీ, ఈ ప్రాజెక్టు ఖర్చుకు వినియోగించే చివరి రూపాయి వరకు కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఒక మంచి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగం, వ్యక్తిగత పన్నులు చెల్లించే శ్లాబ్ విధానంలో మార్పులకు సంబంధించి, స్టార్టప్స్.. ఇలా అనేక అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ ను రూపొందించారని చెప్పారు. ఈ బడ్జెట్ తర్వాత ఎఫ్డీఐలు బాగా వస్తాయని,అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్ కు కొంత నిధులు పెంచామని, నేషనల్ పోలీస్ యూనివర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

Related posts