telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

praksh javadekar

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లు రెండూ వేర్వేరు అంశాలు అని, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను యూటీగా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే బీమాను రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదించడంపై ఆయన ప్రశంసించారు.

Related posts