telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోంది: యనమల

Yanamala tdp

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సవాల్‌ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోందని అన్నారు. జగన్‌ విధ్వంస విధానాన్ని అమలు చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు. 

రాజధాని అంశం ఓ కులానికి.. మతానికి చెందింది కాదని, మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే రాష్ట్రానికి పెద్ద నష్టమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతోందని చెప్పారు. మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలు తీసుకొస్తానని, జగన్ రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని యనమల అన్నారు.

Related posts