telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రామరాజ్య స్థాపన మహాత్మా గాంధీ కల : బండి

అయోధ్య రామ మందిర నిర్మాణానికి గత ఆగస్టులో భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బోరబండలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు.  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి సేకరణ మొదలుపెట్టారు. అయితే ఫ్రిబ్రవరి 10వరకు నిధి సేకరణ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందువులందరు సంఘటితం కావాలనే కోరుకుంటున్నాం. అన్ని రాజకీయ పార్టీలు నిధి సేకరణలో పాల్గొనాలి. నిది సేకరణలో ఎక్కడ బీజేపీ జండా పెట్టము. తెరాస నేతలు కూడా పాల్గొంటున్నందుకు సంతోషం అని అన్నారు. హిందు ఐక్యతతోనే దేశం శక్తి వంతం అవుతోంది. ప్రతి హిందువు రామాలయ నిర్మాణం లో  భాగస్వామ్యం కావాలి. అయితే ఆ రామమందిరం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి. నిధుల సేకరణ కార్యక్రమానికి సీఎం సహకరించాలి. పార్టీ అధ్యక్షుడిగా కాకుండా రామ భక్తుడిగా నిధుల సేకరణ చేస్తాను. దేవాలయాలపై దాడులు బాధాకరం. నిధి సేకరణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలి అన్నారు. ఎందరో కర సేవకుల ఆత్మబలిదానాలు ఫలితమే అయోధ్య రామ మందిరం… రామరాజ్య స్థాపనకు మహాత్మా గాంధీ కలలు కన్నారు. డబ్బులు ముఖ్యం కాదు.. ప్రతి హిందువును  భాగస్వామ్యం చేయటమే ముఖ్యం అని తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts