జేసీ దివాకర్ రెడ్డి నేడు తెలంగాణ పై సంచనలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఏపీ టీడీపీ పార్టీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అక్కడి కాంగ్రెస్ నేతలతో కాసేపు ముచ్చటించారు. చాలా కాలం తరువాత తెలంగాణ అసెంబ్లీకి వచ్చినట్టు అయన తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారికూడా అసెంబ్లీకి రాలేదని అన్నారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంపైన, కాంగ్రెస్ పార్టీపైనా జేసీ దివాకర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని, తెలంగాణలో కాంగ్రెస్ కు కాలం చెల్లిందని అన్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పార్టీని చంపేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదని అన్నారు. చంద్రబాబుకు సిఐడి నోటీసులపై కూడా జేసీ స్పందించారు. బాబుకు సిఐడి ఒక్క పేజీతో కూడిన నోటీసులు ఇచ్చారని, అదే వైఎస్ జగన్ కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఏకంగా లారీల్లో తీసుకెళ్లాలని అన్నారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే చూడాలి మరి దీని పై మన తెరాస నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది.
previous post