వంట గ్యాస్లిండర్ బుక్చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ తీసుకు వస్తాడు. అవసరమైతే ఇంట్లో కూడా పెట్టి వెళ్తాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక నుంచి అలా కుదరదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. కరోనా వ్యాపిస్తున్న కారణంగా డెలివరీ బాయ్లు కూడా రక రకాల ప్రాంతాల్లో తిరిగి సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు.
ఇలాంటి పద్దతి వల్ల కరోనా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. కాబట్టి డెలివరీ ఇక ఇంటిలోపలి వరకు కాకుండా గేటు వరకు మాత్రమే సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆంధ్ర, తెలంగాణ హెడ్ ఆర్.శ్రావణ్ రావు తెలిపారు.
అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు