జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలపై నేడు కేంద్రం కీలక ప్రకటన చేస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ ను నియమించ వచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి గవర్నర్ గా పని చేస్తున్న ఆయన గతంలో తెలుగు రాష్ట్రాలకు, ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా ఉన్నారు.
గతంలో కేంద్ర సర్వీసుల్లోనూ విధులు నిర్వహించారు. హోమ్ శాఖలోనూ పనిచేశారు. శాంతిభద్రతల అంశంపై ఆయనకు ఉన్న పట్టు కారణంగానే కశ్మీర్ గవర్నర్ గా ఆయన పేరును ఖరారు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపేట్టుగా చేసిందని తెలుస్తోంది. ఆయన నియామకంపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.