telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్

KA Paul comments Chandrababu

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సోమవారం తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను అక్కడి నుచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. పవన్ పాలకొల్లు నుంచి పోటీ చేస్తే నేను అక్కడే పోటీ చేస్తానన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ తెలిపారు.

టికెట్ల కోసం తమ పార్టీకి 2000 మంది దరఖాస్తు చేసుకున్నారని పాల్ వెల్లడించారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఈ నెల 21, 22 తేదీలలో నామినేషన్లు వేస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో 79 సీట్లు వస్తాయని పాల్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

Related posts