telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పారితోషికాన్ని ఎక్కువే డిమాండ్ చేస్తా… విద్యాబాలన్

Vidya-balan

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ గత పన్నెండేళ్లుగా కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ‘డర్టీ పిక్చర్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకున్న విద్య, 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందింది. ఇక తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న గణిత మేధావి ‘శకుంతలాదేవి’ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా రేపు డైరెక్ట్ రిలీజ్ అవుతోంది. పెళ్లయిన తర్వాత కూడా కథానాయికగా కొనసాగుతున్న ఆమెకంటూ ఓ మార్కెట్ కూడా వుంది. తాజాగా విద్యాబాలన్ పారితోషికం విషయం మాట్లాడుతూ “మిగతా వాళ్ల విషయమేమో కానీ, నావరకు నేను బాగానే తీసుకుంటాను. గత 12 ఏళ్ల నుంచీ కేవలం మహిళా ప్రధాన చిత్రాలే చేస్తున్నాను. దాంతో నాకంటూ ఇక్కడ ఓ మార్కెట్ కూడా ఏర్పడింది. దాంతో నా సినిమాలకు మార్కెట్ ఇబ్బంది వుండదు. మార్కెట్టును బట్టే పారితోషికం కూడా ఇస్తారు. నా సినిమాలలో నేనే ప్రధాన పాత్ర పోషిస్తాను కాబట్టి అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేది కూడా నేనే” అంతో చెప్పుకొచ్చింది.

Related posts