telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

దుమ్ములేపిన స్పిన్నర్లు… రెండో టెస్టులో ఇండియా విజయం

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీం ఇండియా దుమ్మురేపింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పై 317 పరుగుల తేడాతో టీం ఇండియా విజయ బావుట ఎగురవేసింది. మొదటి మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన టీం ఇండియా రెండో టెస్టులో రెచ్చిపోయింది. టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్‌… రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు అక్షర్‌ పటేల్‌. అటు అశ్విన్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 329 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్‌ అయి.. ఓటమి చవి చూసింది. 4 టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్‌ గెలిచిన భారత్‌, ఇంగ్లండ్‌.. 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. కాగా.. మొదటి టెస్టులో టీం ఇండియా ఇంగ్లండ్‌పై ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే..

Related posts