telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇక నుండి కర్ణాటకలో కొత్త తరహ అభివృద్ది: బీజేపీ నేత యడ్యూరప్ప

yadurappa karnataka

కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలింది. బీజేపీకి అనుకూలంగా 105 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. అనంతరం  విధాన సభ ప్రాంగణంలో బీజేపీ నేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఇక నుండి రాష్ట్రంలో కొత్త తరహ అభివృద్ది సాగుతోందని ఆయన అన్నారు.

ఇది ప్రజాస్వామ్య విజయమని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అందిస్తామని చెప్పారు. కుమారస్వామి పాలనతో ప్రజలు విసిగిపోయారని యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరవు కారణంగా రైతులు పలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము అధికంగా ప్రాధాన్యత ఇస్తామని యడ్యూరప్ప ప్రకటించారు.

Related posts