telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్ కు కేసీఆర్ స్వాగతం

kcr jagan kaleshwaram

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మేడిగడ్డకు చేరుకున్న గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్ , మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. యాగ మండపం వద్దకు తీసుకెళ్లారు. వీరితో కలిసి కేసీఆర్‌ హోమంలో పాల్గొన్నారు. జగన్ తో పాటు ఏపీ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు.

జగన్ తో కరచాలనం చేసేందుకు, ఆయన్ను పలకరించేందుకు తెలంగాణ టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఉత్సాహం చూపించారు. మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, జగన్ లతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు. మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి.

Related posts