తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా ఇటీవలే బాలీవుడ్ లో కూడా ఓ చిత్రంలో కన్పించింది. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి అవకాశాలు అందుకున్న రెజీనా ఇప్పుడు డీలా పడిపోయింది. రెజీనా తన మాజీ ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకుందని, ఈ నెల 13న రెజీనా సీక్రెట్గా నిశ్చితార్ధం జరుపుకుందని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ వార్తలపై రెజీనా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని, ఎక్కడి నుంచి ఈ వార్తలు పుట్టుకొస్తున్నాయో తెలియదని, ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా చిరాకేస్తుందని, పెళ్లి విషయం తానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల పీవీపీ సంస్థ నిర్మించిన “ఎవరు” చిత్రంలో హీరోయిన్ గా నటించింది రెజీనా. ఈ చిత్రం ఆగస్ట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక నూతన దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న “ఉత్సవం”లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమిళంలో “కసడ తపర”, “పార్టీ”, అరవింద్ స్వామితో “కల్లాపార్ట్” అనే సినిమాలతో బిజీగా ఉంది.
previous post
next post