స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం మూడో పాట టీజర్ను విడుదల చేసింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు (గురువారం) సినిమాలోని మూడో పాట `ఓ మైగాడ్ డాడీ` టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కనిపించారు. స్పెషల్ గెస్ట్లుగా సందడి చేశారు. అల్లు అర్జున్ ఫోటో చూసి తల కొట్టుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నారు. కాగా, ఈ పాట పూర్తి వీడియో ఈ నెల 22వ తేదీన బయటకు రానుంది. మీరు కూడా ఈ సాంగ్ టీజర్ ను వీక్షించండి.
previous post
next post