telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతి ప్రచారానికి నిర్మలా సీతారామన్…

Nirmalasitaraman

ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈనెలలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీ ఊపందుకోగా..  తమ పార్టీ అగ్రనేతల ప్రచారంతో ప్లస్ పాయింట్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే  పార్టీ చీఫ్ నడ్డాతోపాటు  కేంద్రమంత్రులు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ప్రచారంలో పాల్గొంటారు. 12న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, 15న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తారు. ఇది ఇలా ఉండగా.. తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు గుర్తు వేరే పార్టీకి కేటాయించడం హాట్‌ టాపిక్‌గా మారింది. కట్‌ చేస్తే సీన్‌ ఢిల్లీ వరకు వెళ్లింది. కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ-జనసేన బృందం సమావేశమైంది. గ్లాసు గుర్తు మరొకరికి కేటాయించడంపై సీఈసీకి బీజేపీ – జనసేన ప్రతినిధుల ఫిర్యాదు చేసింది. అయితే జనసేన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నిక కమిషన్ నవతరం పార్టీకి కేటాయించింది. దీనిపై బీజేపీ, జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts