ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలుగు భాష, సాంస్కృతి అభివృద్ధికి అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలుగు అకాడమీ 32వ సాంస్కృతిక వేడుకలు ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్లో ఆదివారం వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సోమనాథ్ భారతి హాజరయ్యారు. నటులు సుమన్, రాజేంద్రప్రసాద్లతో పాటు పలువురిని కేజ్రీవాల్ ప్రతిభా పురస్కారాలతో సన్మానించారు. తెలుగు భాష, సాంస్కృతి అభివృద్ధికి అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలిపారు. సుమన్, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు వాటిని ప్రోత్సహించాలని కోరారు.
ఢిల్లీ ప్రజల సహకారంతో డెంగీ నుంచి విముక్తి లభించిందన్నారు. కాలుష్య నివారణ చర్యలతో 25 శాతం కాలుష్యం నివారించగలిగామన్నారు. పక్క రాష్ర్టాల సహకారంతో కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సరి బేసి విధానం తీసుకువచ్చినప్పుడు సైతం సరైన నిర్ణయం కాదన్నారు. సరి బేసి విధానం అమలు చేసి దానిలో ఉన్న మంచి ఏమిటో తెలియజేసినట్లు పేర్కొన్నారు.