telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : … కోర్టు కలగజేసుకున్నా.. ఇంకా రిసార్ట్ లోనే రాజకీయాలు ..

resort politics in karnataka again

కర్ణాటకలో కోర్ట్ ఆదేశాల తరువాత కూడా మళ్ళీ రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు శివారులోని రిసార్టులకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో భాగమైన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇరు పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు.

మరోవైపు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి రమదా రిసార్ట్‌కు తరలిస్తోండటం విశేషం. నేటినుంచి కర్ణాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Related posts