telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్‌

bandi samjay mp

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ ప్రజలందరూ సంతోషంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కల నెరవేరిందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్‌షా ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చిందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ దేశంలో అంతర్భాగమని, అది ఎవరి జాగీరు కాదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమో కాదో కాంగ్రెస్, ఇతర పార్టీలు స్పష్టం చేయాలన్నారు.

Related posts