telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

లేడి కానిస్టేబుల్ దారుణాలు : ప్రేమ పేరుతో ముగ్గురితో పెళ్లి.. ఆ తర్వాత

న్యాయం చేయాల్సిన పోలీసులే.. దారుణాలకు ఒడికడుతున్నారు. అవును హైదరాబాద్ లో ఏకంగా ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటుంది మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి..ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్నది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్..ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా.. మరొకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది కానిస్టేబుల్. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకుంది కానిస్టేబుల్. పెళ్లి చేసుకోక పోతే ST, SC అట్రాసిటీ కేసు పెడతానని.. బెదిరింపులకు దిగింది. గత వివాహాలు విషయం తెలికుండా చరణ్ ను నమ్మబలికించి పెళ్లి చేసుకుంది సంధ్య. ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని బాధితులతో గడుపుతున్నది సంధ్య. అసలు విషయం తెలియగానే.. కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుండి తనను రక్షించాలని శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్ లకు ఆన్లైన్ ద్వారా పిర్యాదు చేశాడు బాధితుడు చరణ్. అంతేకాదు సంధ్య రాణిని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాదితుడు పోలీసులకు మొర పెట్టుకున్నాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పొలీసులు విచారణ మొదలు పెట్టారు. సంధ్య రాణి భాదితులు ఎవరైనా ఉంటే ముందురావాలని ప్రాధేయపడ్డ భాదితుడు.. గతంలో సంధ్య రాణి వరస పెళ్లిళ్ల పై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు సంధ్యా రాణి తల్లిదండ్రులు.

Related posts