telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం,,

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య (104) మంగళవారం రాత్రి కన్నుమూశారు.

చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రి-మెడికల్‌ కళాశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు.

ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లని ఈటల స్వగృహానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. ఈటల మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో కుమారుడు.

ఈటల మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను కడసారి చూసేందుకు.. ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.

Related posts